telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై వైసీపీ ఫిర్యాదు

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య పై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈమేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ నాయకులు విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు.

పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వారు మాట్లాడుతున్నరని, డీజీపీ గౌతం సవాంగ్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వర్ల రామయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Related posts