telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రూ.8,614 కోట్లు పోలవరంకు విడుదల: కేంద్రం

polavaram

పోలవరం ప్రాజెక్టుకు 2014 నుంచి రూ.8,614 కోట్ల నిధులు విడుదల చేశామని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చింది.

పోలవరం ప్రాజెక్టు వ్యయంపై ఏపీ ప్రభుత్వం బిల్లులు సమర్పించిందని కేంద్రం వెల్లడించింది. అయితే, ఏపీ ప్రభుత్వం సమర్పించిన బిల్లుల్లో రూ.760 కోట్ల ఖర్చులకు అర్హత లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరో రూ.479 కోట్లకు బిల్లులు అందలేదని కేంద్రం వివరించింది.

మొత్తం రూ,12,506 కోట్ల మేర పనులు చేశామని ఏపీ ప్రభుత్వం తెలిపిందని, 2014 ఏప్రిల్ నుంచి 2020 జూలై వరకు ఈ పనులు చేసినట్టు ఏపీ తెలిపిందని కేంద్రం పేర్కొంది. ప్రాజెక్ట్ 71.46 శాతం పూర్తయిందని తెలిపిందని కేంద్రం వెల్లడించింది.  పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు విడుదల చేయాలని ఏపీ సీఎం జగన్ లేఖ రాశారని కేంద్రం తెలిపింది.

Related posts