telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలు ఆరోగ్యం గురించి ఆరా తీసిన పిఎం కార్యాలయం

SPB

గానగంధర్వుడు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతోన్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో తెలుగు, తమిళ సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలు త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు అందరూ కోరుకున్నారు. ప్రస్తుతం ఈయన కోలుకుంటున్నారని ఆయన కుమారుడు వెల్లడించారు. మరో వారం రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. తన తల్లి మరో మూడు రోజుల్లో కోలుకుంటారని తెలిపారు. మరోవైపు తాజాగా ప్రధాని కార్యాలయ అధికారులు బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. బాలు చికిత్సకు సంబంధించిన వివరాల గురించి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారట. అలాగే ప్రభుత్వం తరఫున తమిళనాడు సీఎం పళని స్వామి కూడా ఎప్పటికప్పుడు బాలు చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారట. బాలు ఆరోగ్యం గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పటికే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మెరుగైన చికిత్సం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Related posts