telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు తిరుమలలో ప్రధాని మోదీ పర్యటన

modi an eye on all states

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలుకుతారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం ఇక్తాఫర్‌ స్వాగతం పలికి మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ప్రధాన మంత్రి హోదాలో ఆయన మూడోసారి తిరుమల వస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్రమోది తిరుమల పర్యటన సందర్భంగా శనివారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి పీఎం, సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి అణువణువునా తనిఖీలు చేస్తూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Related posts