విద్యార్థులపై లాఠీచార్జీలు చేసి దేశం గొంతు నొక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర విమర్శలు చేశారు. .
ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నిరసనకారులు ఎవరో వారు ధరించే దుస్తులను బట్టే చెప్పొచ్చంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు రాహుల్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మోదీ ధరించే దుస్తులను బట్టే ఆయనేంటో అర్థమైపోతుందన్నారు. రెండు కోట్ల రూపాయల విలువైన సూట్ ధరించే మీరేంటో దేశ ప్రజలకు తెలుసని అన్నారు. అంతేకాదు, శత్రువులకు కూడా సాధ్యం కానంతగా దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని రాహుల్ అన్నారు.
ఏ ఆస్పత్రిలో చూసినా మందుల కొరత: ఉత్తమ్