telugu navyamedia
రాజకీయ వార్తలు

శరణార్థులకు సీసీఏ చట్టం ప్రకారం పౌరసత్వం: మోదీ

narendra-modi

భారత్ కు వచ్చిన శరణార్థులకు సీసీఏ చట్టం ప్రకారం పౌరసత్వం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.అంతేగానీ, ఎవరినో పౌరసత్వానికి దూరం చేయబోమని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశంలో నిరసనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ రోజు బిల్లుకు మద్దతుగా సోషల్ మీడియాలో మోదీ ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఇండియాసపోర్ట్స్ సీఏఏ హ్యాష్ ట్యాగ్ తో ప్రజలు ఈ చట్టానికి మద్దతు తెలపాలని మోదీ కోరారు. ప్రజలకు ఈ చట్టంపై ఉన్న అభిప్రాయాలను షేర్ చేయాలని ఆయన చెప్పారు. ఆయన ఈ హ్యాష్ టాగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వేలాది మంది ట్వీట్లు చేశారు.

Related posts