కరోనా వైరస్ దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసులు, సంభవించిన మరణాలు, కరోనా నివారణకు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు మొదలైన వాటిపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యంగా మర్కజ్ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్న వారు ఏయే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఎంత మందికి కరోనా పాజిటివ్గా తేలింది? వారిపై పర్యవేక్షణ ఎలా ఉంది? అనే అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో ‘కరోనా’ కట్టడికి చేపడుతున్న చర్యలు మొదలైన విషయాల గురించి సీఎంలను అడిగి తెలుసుకోనున్నట్టు సమాచారం.
ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేనూ లాక్కునేందుకు కుట్ర: పవన్