telugu navyamedia
రాజకీయ వార్తలు

తమ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుంది: ప్రధాని మోదీ

modi campaign in mahaboob nagar

తమ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానమిస్తూ పార్లమెంట్ లో ప్రసంగించారు. గిరిజనులు, ఆదివాసీలు కూడా తమ ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేశారని చెప్పారు. ఐదేళ్లలో తాము అందించిన పరిపాలకు ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయని అన్నారు.

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. మొన్నటి ఎన్నికలు చాలా ప్రత్యేకమని, తమపై భరోసా ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం వ్యవస్థలతో పోరాడుతున్నారని, అనేక ఇబ్బందులను అధిగమించి దేశం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధికి తగిన చేయూత అందిస్తున్నామని చెప్పారు.

Related posts