దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. “దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయం. తెలంగాణ బీజేపీ నేతలకు కు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మాకు రాష్ట్ర అభివృద్ధికై సేవ చేసేందుకు మరింత శక్తిని ఇస్తుంది. మా కార్యకర్తలు ఎంతో కృషి చేసారు.” అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాగా దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ తక్కువ మెజారిటీ తో గెలిచింది. టీఆర్ఎస్ అభ్యర్థిపై రఘనందన్రావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 61302 ఓట్లు, కాంగ్రెస్ 21819 ఓట్లు, బీజేపీ 62, 772 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బాంక్స్ల్లో ఉన్న ఓట్లల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ విజయం రఘనందన్రావునే వరించింది.
టీఆర్ఎస్ను ఎప్పటికైనా గద్దె దించేది తామే: ఉత్తమ్