telugu navyamedia
రాజకీయ వార్తలు

పుణ్యక్షేత్రాల కంటే .. అవేగొప్పవంటున్న మోడీ..

pm modi on kargil day

ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ డే నేపథ్యంలో అమరవీరులను వేనోళ్ల కొనియాడారు. కార్గిల్ లో పోరాడిన సైనికులు నిజమైన యుద్ధవీరులని కొనియాడారు. కార్గిల్ యుద్ధవీరులకు ప్రణామాలు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడమే అమరత్వం అని పేర్కొన్న మోదీ, అందుకే అమరవీరుల స్మారకాలు పుణ్యక్షేత్రాల కంటే పవిత్రమైనవని భాష్యం చెప్పారు.

నాటి కార్గిల్ విజయం భారత్ సత్తాకు మచ్చుతునక అని, మన సైనికుల కర్తవ్యదీక్షకు సూచిక అని అభివర్ణించారు. కార్గిల్ యుద్ధం తర్వాత మన సైన్యం మంచుకొండల్లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారని కితాబిచ్చారు. దేశ భవిష్యత్తును కాపాడే నిజమైన వీరులు సైనికులేనని, సైనికుల వెనుక దేశప్రజలంతా ఉన్నారని ఉద్ఘాటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించేవారిని ఈ దేశం సదా స్మరించుకుంటుందని తెలిపారు.

Related posts