telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

హాట్‌స్పాట్‌లు పెరగకుండా చూసుకోవాలి: మోదీ

modi speech on J & K

దేశంలో హాట్‌స్పాట్‌లు పెరగకుండా చూసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 3 వరకు లాక్‌డౌన్‌ ను పొడగించినట్టు ప్రకటించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ర్టాలు చర్యలు తీసుకుంటాయన్నారు. ఆహార వస్తువులు, ఔషదాల సప్లయ్‌ని నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. రెండోదశ పరీక్షలో మనం ద్విగుణీకృతంగా పనిచేయాలి.ప్రతీ ప్రాంతం, ప్రతీ రాష్ట్రం కరోనా నుంచి కాపాడుకోవడానికి మరింత కఠినంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్‌ అమలు విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర సంప్రదింపులుంటాయన్నారు. లాక్‌డౌన్‌ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదని మోదీ స్పష్టం చేశారు.

Related posts