పశ్చిమబెంగాల్ లో అంఫాన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 72 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా ఆస్థి నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగాల్ కు చేరుకున్నారు. కోల్ కతా ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి సీఎం మమతాబెనర్జీ స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ బెంగాల్తోపాటు ఒడిశాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒడిశా సీఎం నవీన పట్నాయక్ తో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని వెంట కేంద్రంమంత్రులు ధర్మేంద్ర ప్రదాన బాబుల్ సుప్రియో, ప్రతాప్ చంద్ర సారంగి, దేవశ్రీ చౌదరి ఉన్నారు.
బెంగాల్ లో హింస రాజ్యమేలుతోంది: మోదీ