telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లాక్‌ డౌన్‌ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మోడీ…

Modi Mask

లాక్‌ డౌన్‌ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాని మోడీ. కాసేప్పటి క్రితం మోడీ మాట్లాడుతూ.. దేశంలోనే ఇప్పుడు లాక్‌డౌన్ విధించాల్సిన ప‌రిస్థితులు లేవ‌న్నారు. లాక్‌డౌన్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాని మోడీ.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు త‌ప్పితే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్దు అని.. లాక్ డౌన్ విధించే ప‌రిస్థితి తీసుకు రావొద్దు అని విజ్ఞ‌ప్తి చేశారు.. అయితే, క‌రోనాను నియంత్రించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను చివ‌రి అస్త్రంగానే భావించాలి అని సూచించారు.. లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు ప్ర‌ధాని మోడీ. అలాగే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి కొన్నాళ్లుగా క‌ఠిన‌మైన పోరాటం చేస్తున్నాం అని చెప్పిన ఆయన రెండో ద‌శ‌లో క‌రోనా మ‌రింత తీవ్ర‌మైన స‌వాల్ విసురుతుంద‌న్న ఆయ‌న‌.. కోవిడ్ సెకండ్ వేవ్ తుపాన్ వ‌లే విరుచుకు ప‌డుతుంద‌న్నారు.. క‌రోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, ఇత‌ర వైద్య సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలిపిన ఆయ‌న‌.. ధైర్యంగా ఉంటేనే క‌ఠిన ప‌రిస్థితుల‌ను ఎదుర్కోగ‌లం.. ఇటీవ‌ల మ‌నం తీసుకున్న నిర్ణ‌యాలు భ‌విష్య‌త్‌లో ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుతాయి అని తెలిపారు.

Related posts