telugu navyamedia
రాజకీయ వార్తలు

బాడీ ఫిట్ గా ఉంటే…మైండ్ హిట్ కొడుతుంది: ప్రధాని మోదీ

pm modi on kargil day

ఫిట్ నెస్ తో కూడిన ఇండియా కోసం ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ‘ఫిట్ ఇండియా మూమెంట్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, సెలబ్రిటీలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మెట్లెక్కి విజయాన్ని సాధించాలంటే ఫిట్ నెస్ ఉండాలని అన్నారు. మైండ్ హిట్ కొడుతుందని అన్నారు.

ఫిట్ నెస్ అనేది ప్రతి భారతీయుడి జీవిత మంత్రం కావాలని అన్నారు. టెక్నాలజీ మన జీవన విధానాన్ని మార్చి వేసిందని చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితం ప్రతి వ్యక్తి ప్రతి రోజు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం నడవడమో, సైకిల్ తొక్కడమో లేక పరిగెత్తడమో చేసేవారని… కానీ ఈ టెక్నాలజీ యుగంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. ఫిట్ నెస్ గురించి, డైటింగ్ గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు కూడా డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేసరికి మరో విధంగా వ్యవహరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.

Related posts