telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష…

pm modi

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జరుగుతున్న ఈ సమావేశానికి కేబినెట్‌ సెక్రెటరీతో సహా పలువురు సీనియర్‌ అధికారులు, ప్రధాని ముఖ్య కార్యదర్శ, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ వినోద్‌ పాల్‌ హాజరైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా…ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి.  తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 93,249 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ దశల వారీగా అందిస్తున్న కేసుల సంఖ్యా మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ 45 ఏళ్లకు పైగా ఉన్నవారికి అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సమావేశంలో మోడీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది.

Related posts