telugu navyamedia
రాజకీయ వార్తలు

బెంగాల్ లో హింస రాజ్యమేలుతోంది: మోదీ

pm modi fire pulvama terror attacks

మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్ లో హింస రాజ్యమేలుతోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బెంగాల్ లో ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రధాని స్పందించారు. ప్రముఖ సంఘ సంస్కర్త, బెంగాలీ విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని కూల్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మోదీ డిమాండ్ చేశారు.

కూల్చిన స్థానంలోనే తిరిగి పంచలోహాలతో ఈశ్వర చంద్ర విగ్రహాన్నిఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈశ్వర చంద్ర సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా రోడ్ షోలో దాడికి పాల్పడింది తృణమూల్ కార్యకర్తలేనని మోదీ ఆరోపించారు. దీనిపై మమత వర్గీయులు వెంటనే స్పందించారు. తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేస్తూ, మోదీని అబద్ధాల కోరుగా అభివర్ణించారు.

Related posts