telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ నెల 9న మోదీ తిరుమలకు రాక

modi on telugu states separation

దేశ ప్రధానిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఈ నెల 9న తొలిసారి తిరుమలకు రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్వాగతం పలకనున్నారు. మోదీతో పాటు జగన్ కూడా తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమలకు మోదీ రాక నేపథ్యంలో టీటీడీ అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జగన్‌ హాజరు కాలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మోదీతో జగన్‌ భేటీ అయి పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇక జూన్‌ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం జగన్‌ హాజరు కానున్నారని సమాచారం.

Related posts