telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆరేళ్లు అవుతున్నా ‘అచ్చే దిన్’ రాలేదు: చిదంబరం

congress chidambaram

ప్రధాని మోదీ,పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. మోదీ పాలన వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ‘అచ్చే దిన్’ రాలేదని ఎద్దేవా చేశారు.దేశ ఆర్థిక వ్యవస్థ దిజజారుతోందని, ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల తీరు కూడా సరిగా లేదని, అభ్యంతరకరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులందరూ వాస్తవాలను అంగీకరించడం లేదని చిదంబరం అన్నారు. ప్రజలంతా దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పారు.

2019 జనవరిలో 2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్ నాటికి 7.35 శాతానిక ఎందుకు పెరిగింది? 2019-20 ఆర్ఠిక సంవత్సరానికి గాను రూ. 2.5 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యూలు వస్తాయని వేసిన బడ్జెట్ అంచనాలు ఎందుకు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళలు, పిల్లల కోసం అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఎందుకు తగ్గాయి? ఈ మూడు అంశాలపై మోదీ మాట్లాడాలని చిదంబరం సవాల్ విసిరారు.

Related posts