ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా తెరక్కిన సంగతి తెలిసిందే. ఈనెల 12న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం వాయిదా పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదలను నిలుపుదల చేయాంటూ ఎన్నికల సంఘాన్ని కోరాయి.
మరోవైపు ఈ సినిమాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహనీయుల బయోపిక్ లను చూడాలని దేశం కోరుకుంటుందని అన్నారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరైనా మోదీ బయోపిక్ ను ఎందుకు చూస్తారని ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం: నటి మాధవీలత