ప్రధాని మోదీ రెండ్రోజులు భూటాన్ లో పర్యటిస్తున్నారు. భూటాన్ ప్రభుత్వం ఆయనకు పారో విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికింది. భూటాన్ ప్రధానమంత్రి డాక్టర్ లొటాయ్ షెరింగ్ స్వయంగా విచ్చేసి మోదీకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేస్తూ, తన పట్ల భూటాన్ ప్రధాని చూపిన ఆదరణ హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు.
ఇది ముఖ్యమైన పర్యటనగా భావిస్తున్నానని, విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికిన భూటాన్ ప్రధాని షెరింగ్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. భూటాన్ పర్యటనలో భాగంగా భారత్ 10 ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది.