telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులకు శుభవార్త… రేపే అకౌంట్లల్లో డబ్బులు

pension to farmers in kerala

రేపు “పీఎం కిసాన్ సమ్మాన్ నిధి” నిధులు అర్హులైన రైతుల అకౌంట్లలో 2వేల చొప్పున జమకానున్నాయి. ఈ నేపథ్యంలో “పీఎం కిసాన్ సమ్మాన్ నిధి” కింద రైతులకు అందనున్న ఆర్థిక ప్రయోజనాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రేపు (డిసెంబర్ 25) విడుదల చేయనున్నారు పీఎం నరేంద్ర మోడీ. 9 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయలు పైగా “పీఎం కిసాన్ సమ్మాన్ నిధి” నుంచి బదిలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆరు రాష్ట్రాల రైతులతో కూడా సంభాషించనున్నారు ప్రధాని మోడీ. ప్రధానితో రైతులు “పీఎం కిసాన్ పథకం” తో తమ అనుభవాలను పంచుకుంటారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తెచ్చిన వివిధ పధకాల గురించి రైతులతో నేరుగా మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా హాజరుకానున్నారు. ఢిల్లీలో రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీ రేపు ఏం మాట్లాడతారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Related posts