telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ సినిమా ప్రారంభోత్సవం… పిక్స్ వైరల్

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ఇప్పటికే షూటింగ్ సగ భాగం పూర్తయింది. లాక్‌డౌన్‌కు ముందు జార్జియాలో కీలక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని వచ్చారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు పూజా హెగ్డే, ప్రియదర్శన్ పాల్గొన్నారు. లాక్‌డౌన్ పూర్తికాగానే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా నుంచి అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కనీసం సినిమా టైటిల్‌ను అయినా ప్రకటించాలని కోరుతున్నారు. అయితే, అభిమానుల కోసం ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇవి ఈ సినిమా లాంచింగ్ ఫొటోలు. ఈ సినిమాను 2018లో హైదరాబాద్‌లో ప్రారంభించారు. అయితే, అప్పుడు ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి ఫొటోలను కానీ, వీడియోను కానీ విడుదల చేయలేదు. ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ ద్వారా ఫొటోలను పంచుకున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభాస్, పూజా హెగ్డేతో పాటు దర్శకుడు రాధాకృష్ణ కుమార్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, కృష్ణంరాజు, వి.వి.వినాయక్, రాజమౌళి పాల్గొన్నారు. ఇప్పుడుద్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts