telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొత్తానికి ఒక ఇంటి వాడినయ్యా : నితిన్

నితిన్-శాలినిల వివాహం హైదరాబాద్ లోని ఫలక్నుమా ప్యాలెస్ లో ఆదివారం రాత్రి 8:30 నిమిషాలకు ఘనంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుకలు నిర్వహించారు. చక్కటి అలంకరణతో ముస్తాబైన ఫలక్ నుమా ప్యాలస్ లో వధూవరులు నితిన్ -శాలిని పెళ్లి దుస్తుల్లో ధగ ధగా మెరిసి పోయారు. వేద పండితుల సమక్షంలో నితిన్ మూడు ముళ్ళు వేసి ఓ ఇంటి వాడయ్యాడు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, యువ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు హాజరై నితిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పెళ్లి కొడుకు నితిన్ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా… అందరూ ప్రేమతో దీవించండి’ అంటూ ట్వీట్ చేశారు. నూతన దంపతులకు సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నితిన్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే ‘ మూవీలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీంతో పాటు నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా, అంధాదూన్ రీమేక్, కృష్ణ చైతన్యతో పవర్ పేట అనే ఓ భారీ సినిమా చేయనున్నాడు.

Nithin Nithin Nithin Nithin Nithin Nithin

Related posts