telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దివ్యాంగులు చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం ఉంది: హరీశ్‌రావు

harish rao trs

దివ్యాంగులు చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో హైదారాబాద్ రాజ్‌భవన్ రోడ్‌లోని రూట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, కృత్రిమ అవయవాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని అన్నారు.

దివ్యాంగుల పెన్షన్ ప్రభుత్వం రూ.300 నుంచి రూ. 3 వేలకు పెంచింది. అదేవిధంగా ఉద్యోగాల రిజర్వేషన్లలో 3 శాతం నుంచి 4 శాతానికి పెంచింది. సంక్షేమ పథకాల్లో ఐదు శాతం దివ్యాంగులకు చెందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇతర రాష్ట్రాలలో 70 శాతం శారీరక వైకల్యం ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 40 శాతం ఉన్నా అన్నా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు.

Related posts