telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫోన్‌ చాటింగ్‌ లో రాజకీయ వాగ్వాదం.. బీపీ పెరిగి బీజేపీ నేత మృతి

nokia 2.2 released in India

స్మార్ట్ ఫోన్ చాటింగ్‌ లో రాజకీయ వాగ్వాదంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. చాటింగ్‌ చేస్తూ రాజకీయ విమర్శలు, అనంతం ఫోన్‌లోనే నేరుగా వాగ్వాదంతో బీపీ పెరిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం రుక్మాపూర్‌లో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే…రుక్మాపూర్‌కి చెందిన చెరుకుపల్లి రమేష్‌ (34) మంబాపూర్‌లో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఇతను ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుగా సర్పంచ్‌గా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. ఆ సందర్భంలో ఊర్లో ఉన్న వారితో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడు.

శుక్రవారం ఎంపీపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ గ్రూప్‌లో చాటింగ్‌ చేశాడు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అభ్యంతకర మెసేజ్‌ పెట్టడంతో ఇద్దరి మధ్య చాటింగ్‌లో వాగ్వాదం మొదలయింది. కొంతసేపు విమర్శలు కొనసాగిన తర్వాత రమేష్‌ నేరుగా సదరు వ్యక్తికే ఫోన్‌చేసి వాగ్వాదానికి దిగాడు. దాదాపు అరగంటపాటు ఇద్దరి మధ్యా వాగ్వాదం కొనసాగింది. ఈ సమయంలో రమేష్‌ రక్తపోటు ఎక్కువై కళ్లు తిరిగి పడిపోయాడు. దీన్ని గమనించి భార్య సంతోషిణి వెంటనే అతన్ని సమీపంలోని తాండూరు ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే రమేష్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Related posts