దేశప్రధాని మోడీపై తీవ్రంగా వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యతిరేకతను దైర్యం చేసి వెళ్లబుచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి.. అందుకే ఒక క్వార్టర్ లోనికిపంపాడు.. ఆ మత్తులో ఓ వ్యక్తి పోలీసు కంట్రోలు రూంకు ఫోన్ చేసి ప్రధాని నరేంద్రమోదీని హత్య చేయబోతున్నానని చెప్పి కలకలం రేపాడు. అతడి ఫోన్కాల్తో అప్రమత్తమైన పోలీసులు, ఇంటెలిజన్స్ అధికారులు ఫోన్ నంబరు ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఆనంద్ పర్బత్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.
ఇదంతా చేసింది, స్థానికంగా దర్జీ పనిచేసుకుంటూ జీవిస్తున్న ముక్తియార్ అలీ (53), వ్యాపారంలో బాగా నష్టపోయాడు. ఆ ఒత్తిడిలో ఉన్న అలీ ఫుల్లుగా మద్యం తాగొచ్చి పోలీసు కంట్రోలు రూంకు ఫోన్ చేశాడు. ప్రధానిని చంపేయబోతున్నానని చెప్పి పెట్టేశాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ముక్తియార్ ఫోన్తో కదిలిన పోలీసులు ఫోన్ నంబరు ఆధారంగా అలీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అలీ మంచోడేనని, మద్యం మత్తులోనే కంట్రోలు రూంకు ఫోన్ చేశాడని దర్యాప్తులో తేలింది. నిందితుడిపై గతంలో ఎటువంటి కేసులు లేవని పోలీసులు పేర్కొని, ఊపిరి పీల్చుకున్నారు.
“రజనీకాంత్ శరీరం అంత క్రిటికల్గా ఉంది మరి”… దర్శకుడి షాకింగ్ కామెంట్స్