telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు…

petrol bunk

మే 4వ తేదీ నుంచి వ‌రుస‌గా పెరుగుతూ పోతున్నాయి చ‌మురు ధ‌ర‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు 27 సార్లు వ‌డ్డించాయి చ‌మురు కంపెనీలు.. ఇక‌, ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మ‌రింత పెంచారు.. లీట‌ర్ పెట్రోల్‌పై 27 పైస‌లు, లీట‌ర్ డీజిల్‌పై 30 పైస‌ల చొప్పున పెంచాయి ఆయిల్ సంస్థ‌లు.. తాజా వ‌డ్డింపుతో క‌లిపి హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ రూ.100.74కి చేర‌గా.. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.95.60గా ప‌లుకుతోంది. ఇక‌, విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.102.93కి ప‌రుగులు పెట్ట‌గా.. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.97.17కు ఎగ‌బాకింది.. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ సెంచ‌రీ కొట్టేసింది.. డీజిల్ కూడా సెంచ‌రీ వైపు ప‌రుగులు తీస్తోంది.. ఇక‌, రాజ‌స్థాన్‌లోని శ్రీ‌గంగాన‌గ‌ర్‌లో ఇప్ప‌టికే సెంచ‌రీ దాటి రూ.100.82కు చేరింది లీట‌ర్ డీజిల్ ధ‌ర‌. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts