telugu navyamedia
రాజకీయ వార్తలు

కేజ్రీవాల్ సర్కార్ మరో బాదుడు..పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు!

arvind-kejriwal

కేంద్రం సడలింపులు ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా రుసుము పేరుతో మద్యంపై 70 శాతం అదనపు పన్నును విధిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో మరో నిర్ణయాన్ని కూడా ఢిల్లీ సర్కారు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పెట్రోల్ పై ప్రస్తుతం వసూలు చేస్తున్న 27 శాతం వ్యాట్ ను 30 శాతానికి పెంచింది. డీజిల్ పై వ్యాట్ ను 16.75 శాతం నుంచి 30 శాతానికి పెంచేశారు. ఈ రాత్రి నుంచి వ్యాట్ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి.

Related posts