telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

Supreme Court

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.  శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్‌ దాఖలైంది. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది.

సుప్రీంకోర్టు 2014 మార్గదర్శకాలను పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ దాఖలు చేశారు. ఇక నిందితుల మృతదేహాలు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. ఆసుపత్రి ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts