telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు పై ఏపీ హైకోర్టులో పిటిషన్

chandrababu fire on AP CS again

ప్రభుత్వ పథకాల పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు అయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వ నిధులను వాడుకున్నారని రిపబ్లిక్ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కుమార్ తన పిటిషన్ లో తెలిపారు.

ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారని ఆరోపించారు. ఈ నిధుల మొత్తాన్ని చంద్రబాబు సొంత ఖర్చుల కింద జమ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

Related posts