telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికల సందడి : ఒక్కసారే.. 2500 కోళ్ల ఫ్రై..

personnal rivals arised in elections

పశ్చిమబెంగాల్ లో సార్వత్రిక ఎన్నికల వేళ, రాజకీయం హింసాత్మకంగా మారుతోంది. ఇటీవల సీపీఎం నేత మొహమ్మద్ సలీం కాన్వాయ్ ను 500 మంది దుండగులు కర్రలు, తుపాకులతో వెంబడించి దాడి చేశారు. అంతేకాకుండా బీజేపీ మద్దతుదారుడైన శిశుపాల్ సాహిస్(22) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు చెట్టుకు ఉరివేసి చంపేశారు. తాజాగా ఈ గొడవలు ఆస్తుల విధ్వంసానికి పాకాయి. బీజేపీ నేత గుప్తాకు చెందిన ఓ కోళ్ల ఫారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు నిన్న రాత్రి తగలబెట్టారు. ఈ ఘటనలో సదరు కోళ్ల ఫారంలో ఉన్న 2,500 కోళ్లూ కాలి బూడిదయ్యాయి.

దీని తో బాధితుడు గుప్తా మాట్లాడుతూ. అధికార టీఎంసీ పార్టీ కార్యకర్తలే ఈ దారుణానికి తెగబడ్డారని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ అగ్నిప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Related posts