టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు అమరావతిలో తిరిగే నైతిక అర్హత ఉందా? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని నాని ప్రశ్నించారు.
రాజధాని అమరావతికి రావాలంటే ఇప్పటికీ ఒక్క మంచి రోడ్డు లేదన్నారు. సచివాలయం నారాయణ కాలేజీ హాస్టల్ బిల్డింగ్లా ఉందని ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్కి వస్తే కనీసం టాయిలెట్ కూడా లేదన్నారు. రాజధాని పేరుతో ప్రజలను దారుణంగా వంచించిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తారని దుయ్యబట్టారు.