telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వచ్చిన ముసలి వాళ్ళు చనిపోవాల్సిందే : బీజేపీ మంత్రి షాకింగ్ కామెంట్స్

People queue standing in circles drawn to maintain safe distance as they wait to buy grocery items during a 21-day nationwide lockdown to limit the spreading of Coronavirus disease (COVID-19), in Kolkata

దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కు మొగ్గుచూపుతున్నాయి. అయితే ఈ తరుణంలో మధ్య ప్రదేశ్ మంత్రి ప్రేమ సింగ్ పటేల్ సంచలన వ్యకియాలు చేశారు. మనుషులన్నాక, మూసలివాళ్ళు అవుతారని, ఆ తర్వాత చనిపోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దేశంలో చోటు చేసు చేసుకుంటున్న కరోనా మరణాలపై అడిగిన ప్రశ్నకు.. మంత్రి ఈ విధంగా స్పందించారు. “మరణాలు సంభవించాయని నేను ఒప్పుకుంటున్నాను. వాటిని ఎవరు ఆపలేరు, ప్రజలు మాస్క్ లు ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. కరోనా ను ఎదురుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మనుషులన్నాక, మూసలివాళ్ళు అవుతారు, ఆ తర్వాత చనిపోవాల్సిందే ” అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ప్రేమ సింగ్ పటేల్. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related posts