టీఆర్ఎస్ను ఎప్పటికైనా గద్దె దించేది తామేనని టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆరు స్థానాల్లో గెలుస్తామని అనుకున్నామని కానీ , అదృష్టం కొద్దీ బీజేపీ గెలిచిందనిన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లలో డిపాజిట్ రాలేదన్నారు.
సీఎం కేసీఆర్కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి 25,682 ఓట్ల మెజారిటీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై ఉత్తమ్ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధికార టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మేల్యేలు పార్టీ ఫిరాయింపులు చేయడంతో తెలంగాణలో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ నేపథ్యంలో మూడు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.
అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నాను: ఎమ్మెల్యే లింగయ్య