telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటి పాయల్ రోహత్గికి బెయిల్ మంజూరు

Payal-Rohatgi

నెహ్రూ, గాంధీ కుటుంబాలపై సోషల్‌మీడియాలో అభ్యంతరకరంగా పోస్టు చేశారన్న ఆరోపణల కేసులో బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గీని రాజస్థాన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబసభ్యులను దూషిస్తూ పాయల్ రోహత్గి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి చర్మేశ్‌ శర్మ ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు అక్టోబర్‌ 10న బుండి పోలీస్‌స్టేషన్‌లో పాయల్ పై ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదుచేశారు. డిసెంబర్ 16న బుండి కోర్టు పాయల్ కు 8 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తాజాగా ఈ కేసులో పాయల్ కు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల బాండ్ తో ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరవగా..పాయల్ జైలు నుంచి విడుదలైంది.

Related posts