టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హిట్ లలో ఒకటిగా నిలిచిన “అరుంధతి” సినిమా పేరు చెప్పగానే… మన కళ్ళముందు జేజమ్మ రూపంలో ఉన్న అనుష్క మెదులుతుంది. పశుపతిగా సోనూసూద్ నటన ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఇప్పుడు “అరుంధతి-2” సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై కోటి తూముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యం, భారీ బడ్జెట్, విజువల్స్తో “అరుంధతి-2” రూపొందనుంది. కానీ ఈసారి టైటిల్ పాత్రలో పాయల్ రాజ్పుత్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ “ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువైలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కథాంశంలో భాగంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ , గుర్రపుస్వారీ, కత్తి సాములకు సంబంధించిన శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం” అని అన్నారు.
previous post
next post