telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రజలకు జనసేన వరాలు.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

ఉచిత విద్యతో పాటు ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్టు జనసేన ప్రకటించింది. బుధవారం జనసేన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8వేలను ఇవ్వనున్నట్టు ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రల వారీగా చేపట్టనున్న అభివృద్ధి గురించి మేనిఫెస్టోలో ఆ పార్టీ వివరించింది.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందిస్తామని ప్రకటించింది. గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ బదులుగా మహిళల ఖాతాల్లో రూ. 2500 నుండి రూ.3500 చెల్లించనున్నట్టు జనసేన ప్రకటించింది. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. మొత్తం 96 హామీలను జనసేన పొందుపర్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని జనసేన ప్రకటించింది.

Related posts