telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు కోసం డబ్బు తెచ్చి ఇంగ్లీష్ కోసం ఖర్చు చేస్తారా?

pawan-kalyan

ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి తెలుగు భాష కోసం డబ్బులు తీసుకుని ఇంగ్లీష్ కోసం ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్లు పెట్టారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకునేందుకు తప్ప, తెలుగు భాష మరెందుకూ పనికిరాకుండా పోయిందన్న రీతిలో ఆయన వ్యాఖలు సాగాయి.

తెలుగు కోసం డబ్బులు తీసుకొని,ఇంగ్లీషు కోసం ఖర్చుపెడతారా? ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం దీన్ని గమనిస్తూనే ఉంది జగన్” అని పవన్ హెచ్చరించారు. అంతకుముందు “కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప , మనకి తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్న మాట…పార్లమెంటులో నరసాపురం పార్లమెంటు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటే నాకే కాదు, ఎవరికైనా అదే అనిపిస్తుంది” అని పవన్ ట్విటర్ లో ప్ర్కోన్నారు.

Related posts