ఏపీకి దిశానిర్దేశం చేసేందుకే మూడో పక్షంగా జనసేనను స్థాపించానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పుల కోసం జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఐడియాలజీ, ప్రాక్టికాలిటీతో ముందుకెళ్తానని ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీ కంటే ముందే కామన్మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినట్లు తెలిపారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. కానీ రాజకీయాలు తనకు వ్యాపారం కాదని పేర్కొన్నారు. అధికారం కోసం చూసేవారికి ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయన్నారు. ప్రతిపక్ష నేత జగన్ తీరును జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ తప్పుపట్టారు. జగన్లా చంపేయండి, చింపేయండని తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. నేను ఏ విమర్శ చేసినా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించానని పవన్ పేర్కొన్నారు.
ఇళ్ల స్థలాల పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్: కళా వెంకట్రావు