telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని ప్రాంత రైతులను కలిసిన పవన్

pawan-kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పర్యటన ప్రారంభించిన పవన్ రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజధాని కొనసాగింపు విషయంలో సందిగ్డం ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు ఆయన రైతుల వద్దకు తరలి వెళ్లారు. నిడమర్రులో రైతుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు తన సమస్యలను పవన్ కు వివరించారు. నిడమర్రు తర్వాత ఆయన కురగల్లు, ఐనవోలు ప్రాంతాల మీదుగా ఎన్ జీవోల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లను, హైకోర్టు నిర్మాణాలను పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్లు, ఏపీ సచివాలయం, సీఆర్ డీఏ భవనాలు, జడ్జిలు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు తదితర ప్రాంతాల్లోనూ పవన్ పర్యటన సాగనుంది.

Related posts