జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై స్పందించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, అభివృద్ధి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని బీజేపీతో కలిశామని చెప్పారు. 2014లోనూ బీజేపీతో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. అన్ని అంశాల గురించి లోతుగా ఆలోచించిన తర్వాతే పొత్తు ఖరారు చేశామని తెలిపారు.
ఇరువైపుల నుంచి ఎలాంటి షరతులు లేవని వెల్లడించారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకునే నిర్ణయాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. లేకపోతే అపోహలకు దారితీసే అవకాశం ఉందని పవన్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ట్రిక్స్కు మోసపోయే వారెవరు లేరు: విజయశాంతి