దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి . ఇప్పటికే అధికార టీడీపీ తొలి జాబీతాను ఖరారు చేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తోంది. తాజాగా జనసేన తన అభ్యర్థుల ఎంపికపై కీలక ప్రకటన విడుదల చేసింది. 32 అసెంబ్లీ స్థానాలకు, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
previous post
next post
పట్టాభికి నవంబర్ 4 వరకు రిమాండ్..