telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆడపడచుల స్ఫూర్తికి తెలుగు వాళ్లు గర్విస్తున్నారు: పవన్

pawan-kalyan

రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు చేపట్టిన నిరసనలు నేటితో 50 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆడపడుచుల ఉద్యమ స్ఫూర్తికి తెలుగువాళ్లు గర్విస్తున్నారని తెలిపారు.

వారు అనుసరిస్తున్న శాంతియుత పంథా చూసి ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. రోడ్డునపడ్డ రైతులకు అండగా ఉంటానని గతంలోనే మాటిచ్చానని, ఈ నెల 10 తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. రైతుల వాణి దేశం నలుమూలలా వినిపించేలా నినదిస్తానన్నారు. రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు.

Related posts