telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపు చంద్రబాబు ఇసుక దీక్ష..పవన్ తో టీడీపీ నేతల భేటీ

Pawan-Kalyan-Chandrababu-

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు రేపు 12 గంటల పాటు ‘ఇసుక దీక్ష’ను చేపట్టనున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని పవన్ కల్యాణ్ నివాసానికి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య వెళ్లారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు.

మరోవైపు, విశాఖలో ఇటీవల పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, స్వయంగా టీడీపీ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు దీక్షపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Related posts