జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో నొప్పి తీవ్రం కావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షించిన వైద్యుల బృందం పరిస్థితి మరింత విషమించక ముందే శస్త్ర చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అయితే ఇందుకు పవన్ కల్యాణ్ అంగీకరించలేదని సమాచారం.
ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం విషయంలో జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీ పనులను కొన్నాళ్లు పక్కనపెట్టి వెన్నునొప్పికి నేచర్ క్యూర్ పద్ధతిలో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. పవన్ ట్రీట్మెంట్కు వెళితే కొన్నాళ్లపాటు పార్టీకి అందుబాటులో ఉండక పోవచ్చు.