telugu navyamedia
సినిమా వార్తలు

పవన్‌, హరీశ్‌శంకర్‌ మూవీ నుంచి పవర్‌ ఫుల్ అప్‌డేట్‌ వచ్చేస్తోంది

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పవన్‌ సినిమా తీయాలని డైరెక్ట్‌ర్‌ హరీశ్‌ శంకర్‌ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్ పుట్టిన రోజున తమ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందంటూ ప్రీ లుక్‌ విడుదల చేశాడు డైరెక్టర్‌.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. రేపు ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ రాబోతుందని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. సెప్టెంబర్ 9న ఉదయం 9.45 గంటలకు ఈ మూవీ నుంచి పవర్‌ ప్యాక్ట్‌ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్ర నిర్మాతలు, దర్శకుడు హరీష్ శంకర్‌, పవన్ కళ్యాణ్‌ను కలిసి సినిమా షూటింగ్ విషయమై చర్చలు జరిపారు.

Image

దీనికి సంబంధించిన ఫొటోను చిత్రయూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్‌ అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం‌. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పైకి వెళ్లనుంది.

Related posts