telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఫలితాలపై పవన్‌ కళ్యాణ్‌ స్పందన

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోమవారం స్పందించారు. అధికారిక ఫలితాల ప్రకారం జనసేన అభ్యర్థులు 177 ఎంపీటీసీ స్థానాలు, 2 జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నారని పవన్ పేర్కొన్నారు. ఏప్రీల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన అభ్యర్థులు బలమైన పోరాటం చేశారని అన్నారు. పార్టీ తరఫున విజయం సాధించినవారికి జనసైనికుల తరఫున, పార్టీ నేతల తరఫున హృదయపూర్వక అభినందనలు అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో, ఏ నేపథ్యంలో జరిగాయి అనేందుకు తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పవన్ పేర్కొన్నారు. అయితే, అదనపు సమాచారం కోసం చూస్తున్నామని, ఒకట్రెండు రోజుల్లో దీనిపై సంపూర్ణ విశ్లేషణ చేపట్టి మరోసారి ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.

Related posts