ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం స్పందించారు. అధికారిక ఫలితాల ప్రకారం జనసేన అభ్యర్థులు 177 ఎంపీటీసీ స్థానాలు, 2 జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నారని పవన్ పేర్కొన్నారు. ఏప్రీల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన అభ్యర్థులు బలమైన పోరాటం చేశారని అన్నారు. పార్టీ తరఫున విజయం సాధించినవారికి జనసైనికుల తరఫున, పార్టీ నేతల తరఫున హృదయపూర్వక అభినందనలు అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో, ఏ నేపథ్యంలో జరిగాయి అనేందుకు తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పవన్ పేర్కొన్నారు. అయితే, అదనపు సమాచారం కోసం చూస్తున్నామని, ఒకట్రెండు రోజుల్లో దీనిపై సంపూర్ణ విశ్లేషణ చేపట్టి మరోసారి ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.
పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు అభినందనలు – JanaSena Chief Shri @PawanKalyan
Video Link: https://t.co/yYJCIfN2L0 pic.twitter.com/RIaLs9fPEV
— JanaSena Party (@JanaSenaParty) September 20, 2021
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో గెలుపొందిన జనసేన అభ్యర్థులకు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ అభినందనలు.#ZPTCMPTCResult pic.twitter.com/eZM6ekGVlj
— JanaSena Party (@JanaSenaParty) September 20, 2021