telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వేలం నుంచి గుంటూరు మార్కెట్ తొలగింపు: పవన్ హర్షం

pawan

గుంటూరు మార్కెట్ ను వేలం నుంచి తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని పీవీకే నాయుడు మార్కెట్ ను ప్రజా ఆస్తుల వేలం జాబితా నుంచి తప్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పవన్ పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని గుంటూరు మార్కెట్ ను వేలం జాబితా నుంచి తొలగించాలన్న సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్కెట్ పై ఎంతోమంది పేదలు ఆధారపడి ఉన్నారని అన్నారు. చిరువ్యాపారస్తులు కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకుంటూ జీవించేవారు ఉన్నారని పేర్కొన్నారు. వారందరికీ ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు.

Related posts