పవన్ ఈ సంవత్సరం తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు. వేసవిలో ‘వకీల్ సాబ్’గా పలకరించనున్నాడు పవన్. మే 15న ఈ రీమేక్ మూవీ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. అంతేకాదు… ఆరు నెలల గ్యాప్ తో ఇదే సంవత్సరం మరో క్రేజీ ప్రాజెక్ట్ తోనూ సందడి చేయనున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడిక్ ఫిల్మ్… ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకుని దీపావళి కానుకగా నవంబర్ 13న రిలీజ్ కానుందట. ఒకే సంవత్సరంలో పవన్ రెండేసి సినిమాలతో ఎంటర్ టైన్ చేయడం ఇదే తొలిసారి కాదు. 1998లో ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’తో… 2006లో ‘బంగారం’, ‘అన్నవరం’తోనూ పలకరించాడు. అలాగే 2011లో ‘తీన్ మార్’, ‘పంజా’తోనూ… 2012లో ‘గబ్బర్ సింగ్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’తోనూ సందడి చేశాడు. ‘అజ్ఞాతవాసి’ అనంతరం క్రియాశీలక రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ ఈ ఏడాది వెండితెరపై అభిమానులకు వినోదాల విందు పంచేందుకు సిద్ధమయ్యాడు.
previous post
అందాలు ఆరబోస్తే తప్పేంటి ? : హీరోయిన్