మెగాస్టార్ చిరంజీవి త్వరలో తన కోడలు ఉపాసన బాబాయ్ అయిన కాంగ్రేస్ ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణాలోని చేవెళ్ల నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అన్ని మీడియా సంస్దలు ఈ వార్తను కవర్ చేసాయి. తాజా సమాచారం మేరకు అన్నయ్య చిరంజీవి ఎక్కడా ఎవరికోసం ప్రచారం చేయటానికి వెళ్ళడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
జనసేన ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి వస్తే బాగుంటుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, అన్నయ్య చిరంజీవి జనసేన ప్రచారానికి రారని పవన్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు సంబంధించి అన్నయ్య ఒక తుది నిర్ణయానికి వచ్చేశారని పవన్ తెలిపారు. రాజకీయాల్లో మా నిర్ణయాలు వేరుగా ఉంటాయని ఈ విషయంలో తమ ఇద్దరి మధ్య పూర్తి అవగాహన ఉందని చెప్పారు.
కేసీఆర్ కేబినెట్లో మహిళలకు స్థానం కల్పిస్తారా?